13-05-2025 12:00:00 AM
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 12 (విజయక్రాంతి): ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ అధికారులు తక్షణమే స్పందించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీసులను స్వచ్ఛందంగా ఆశ్రయించాలని సూచించారు.
పైరవీలకు తావు లేకుండా సమస్యలను చట్ట ప్రకారం పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. శాంతిభద్రతల ను పరిరక్షిస్తూనే ప్రజలకు మరింత దగ్గర అయ్యేలా పోలీస్ శాఖ ముందుకు వెళుతుందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి సమస్యలు పరిష్కరించాలని ఎనిమిది మంది అర్జీలు అందజేశారు.