calender_icon.png 10 November, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి కొనుగోళ్లలో ఆంక్షలను తొలగించాలి

10-11-2025 01:01:14 AM

రైతుసంఘం మహిళా రాష్ర్ట కన్వీనర్  కందాల ప్రమీల 

నకిరేకల్, నవంబర్ 9(విజయక్రాంతి) : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోళ్లలో రైతులను ఇబ్బం దులకు గురిచేస్తున్న ఆంక్షలను వెంటనే తొలగించి పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఏఐకేఎస్ తెలంగాణ రైతు సంఘం మహిళా రాష్ర్ట కన్వీనర్ కందాల ప్రమీల  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. ఆదివారం కట్టంగూరు మండల కేంద్రంలో అమరవీరుల స్మారక భవనంలో రైతు సంఘం నాలుగో మండల మహాసభను నిర్వహించారు. ఈ మహా సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

కేంద్రంలోని మోడీ అనంతరం ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించడం మాత్రమే కాకుండా, రైతులను ఇబ్బందులు పెట్టేందుకు అనేక నిబంధనలు పెట్టిందన్నారు. రైతులు ఎండనక వాననక పత్తి పంట పండించడానికి తీవ్రకష్టాలు పడుతున్నా కొనుగోళ్లలో సాంకేతిక ఆంక్షలతో నెట్టేస్తున్నారని తెలిపారు. కపాస్కిసాన్ యాప్ ద్వారా ముందుగా స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేయడం, తేమ శాతం 10 లోపే ఉండాలని నిబంధన పెట్టడం, ప్రతి ఎకరాకు కేవలం 7 క్వింటాళ్ల వరకే కొనుగోలు పరిమితి విధించడం వల్ల పత్తి రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.  అనంతరం నూతన కమిటీ ఎన్నుకున్నారు.

గౌరవాధ్యక్షులుగా ఎన్న నర్సిరెడ్డి  అధ్యక్షులు మురారి మోహన్ ఉపాధ్యక్షులు నంద్యాల అనంత రెడ్డి ఉపాధ్యక్షులు  గద్దపాటి ఎల్లయ్య ప్రధాన కార్యదర్శి  పెంజర్ల కృష్ణ సహాయ కార్యదర్శి మారబోయిన లక్ష్మీనారాయణ సహాయ కార్యదర్శి ఊటుకూరి సుజాత సభ్యులు మారెడ్డి రఘురాం రెడ్డి వంగూరు ఎల్లయ్య కంచర్ల సాగర్ రెడ్డి గండమల్ల బిక్షం, కొరివి దుర్గయ్య, తుల బిక్షమయ్య, చింతల చలపతి రెడ్డి, వనం సుందర్.  సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, రైతు సంఘం నాయకులు. జాల ఆంజనేయులు పాల్గొన్నారు.