calender_icon.png 25 June, 2025 | 8:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోడు రైతుకు ఆంక్షలు

25-06-2025 01:47:36 AM

  1. వ్యవసాయ పనులు ప్రారంభమైన రైతులకు తీరనివెతలు 
  2. పనులు చేయొద్దు అంటూ.. ఫారెస్ట్ అధికారుల హుకుం
  3. రోడ్డున పడతామని ఆందోళనలో పోడు రైతులు 

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్24 ( విజ యక్రాంతి): అడవుల జిల్లాలో పోడు వ్యవసాయం చేస్తున్న రైతుల  వెతలు వానకాలం వ్యవసాయ పనులు ప్రారంభమైన తీరడం లేదు. ఆటవిశాఖ అధికారులు పోడు వ్యవసాయం చేస్తున్న రైతులను నేటికీ అందుకోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రతి సంవత్సరం జిల్లాలో పోడు భూముల సమ స్య లేవనెత్తుతున్నప్పటికీ దాన్ని పూర్తిస్థాయిలో పరిష్కరించడంలో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారుల సమన్వయం లోపంతో ముందు కు సాగడం లేదు.

సిర్పూర్ నియోజకవర్గం లో అత్యధికంగా పోడు వ్యవసాయం చేస్తు న్న వారిలో గిరిజనుల కంటే గిరిజన ఇతరు లే ఎక్కువ శాతం ఉన్నారు. ప్రతి ఏటా పోడు భూముల్లో వ్యవసాయం చేయకుండా ఫారె స్ట్ అధికారులు అడ్డుకోవడం మామూలుగా నే మారింది. శాఖ ఉన్న అధికారుల ఆదేశాలతో క్షేత్రస్థాయిలో అధికారులు తీవ్రంగా ఇబ్బందులు సైతం పడుతున్నారు. పోడు భూముల వద్దకు అటవీశాఖ అధికారులు వెళితే పోడు రైతులు అడ్డగించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంఘటనలు కూడా ఉన్నాయి. 

ప్రభుత్వం పోడు వ్యవసాయం చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వడంతో పాటు రైతుబంధు (రైతు భరోసా) పథకం వర్తింపజేస్తుంది. జిల్లాలో  15254 మంది పోడు రైతులకు 44 750 ఎకరాలకు సంబంధించిన పట్టాలను అందజేశారు. పట్టాలు సైతం వారు సాగు చేస్తున్న భూమి కంటే తక్కువగా ఇచ్చారని ఆరోపణలు సైతం లేకపోలేదు.

సీజన్ ప్రారంభమైన తీరని సమస్య..

వానకాలం వ్యవసాయ పనులు చేపట్టడంలో రైతన్నలు నిమగ్నమయ్యారు. అన్ని ప్రాంతాలలో విత్తనాలు నాటడంతోపాటు మొలకలు సైతం వచ్చాయి. ప్రధానంగా జిల్లాలోని బెజ్జూరు మండలం పాపన్నపేట గ్రామం, చింతలమానపల్లి మండలం దిందా గ్రామం, పెంచికల్పేట్ మండలం జైయింద్ పూర్ గ్రామాలలో పోడు భూముల సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఒకవేళ వ్యవసాయ పనులు చేయాలనుకున్న నాగలి తోనే దున్నాలని ఫారెస్ట్ అధికారులు హు కుం జారీ చేశారు. పోడు భూముల్లో ట్రాక్ట ర్లు పెట్టవద్దని యజమానులను ఆదేశించారు. పోడు వ్యవసాయమే ఆధారంగా జీవి స్తున్న రైతులను అధికారులు వేధించడం, అడవుల రక్షణ పేరిట ప్రతిఏటా ఇబ్బందులకు గురిచేయడం జరుగుతుందని పోడు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రతి ఏటా ఆందోళన బాట..

పోడువ్యవసాయం చేస్తున్న రైతులు ప్రతి సంవత్సరం వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు ఆందోళన బాట చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో కాగజ్‌నగర్ మండలం అంకుసాపూర్ మండలం శివారులో జరిగిన ఘర్షణలో పోడు వ్యవసా యం చేస్తున్న 70 మంది రైతులు, రెబ్బెన మండలం తుంగేడ శివారు లో 42 ఎకరాల్లో సాగు చేస్తున్న 12 మంది రైతులు జైలుకు వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా పోడు రైతులకు మద్దతుగా నిలిచిన అప్పటి జడ్పీవైస్ చైర్మన్ కోనేరు కృష్ణా, ప్రస్తుత సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గతంలో జైలుకు వెళ్లిన సంఘటనలు ఉన్నాయి.

మంత్రులు చెప్పిన మారని తీరు..

పోడు వ్యవసాయం చేస్తున్న రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని రాష్ట్ర మం త్రులు పలు సందర్భాలలో అటవీ శాఖ అధికారులకు సూచించినప్పటికీ ఆ శాఖ తీరు మాత్రం మారడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న సీతక్క పలు సందర్భాల లో ఆశాఖ అధికారులకు పోడు వ్యవసాయం చేస్తున్న రైతులను ఇబ్బందులకు పెట్టొద్దని సూచించారు.

అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ సైతం పోడు వ్యవసాయం చేస్తున్న రైతులను ఇబ్బంది పెట్టవద్దని కొత్తగా అడవిని నరకకుండా చూడాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ జిల్లాలో పోడు వ్యవసాయం చేస్తున్న రైతులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ సదస్సులో భాగంగా పెంచికల్పేట్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పోడు రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని అధికారులను ఆదేశించారు. మంత్రులు స్వయంగా చెప్పినప్పటికీ పోడు రైతుల అవస్థలు మాత్రం తగ్గడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆ భూమి జీవనాధారం

దింద గ్రామ శివారులో 40 ఏండ్లుగా 5 ఎకరాలలో పోడు వ్యవ సాయం చేస్తున్న. ఆ భూమి తప్ప మాకు వేరే ఆధారం ఏదీ లేకపోవడంతో దాన్నే నమ్ముకుని కాయ కష్టం చేసుకుం టూ జీవనం గడుపుతున్న. ఇప్పుడు ఫారెస్ట్ సార్లు వచ్చి వ్యవసాయం చేయవద్దని అడ్డుకుంటున్నారు. మేము వ్యవ సాయం చేస్తున్న భూమిలో అటవీ శాఖ అధికారులు ప్లాంటేషన్ చేస్తామని చెబుతున్నారు. మా భూములు లాక్కొని మా పొట్ట వద్దని మొక్కుతున్నాను.

 ఎలకరి బాలాజీ, దిందా

సన్న కారు రైతులను ఇబ్బందులకు పెట్టడం లేదు 

జిల్లాలో పోడు భూములకు పట్టాలు ఇవ్వడం జరిగింది. 80 వేల ఎకరాల సం బంధించి ఎస్టీలకు పట్టాలు ఉండగా  90 వేల ఎకరాల భూమి గిరిజనేతరుల ఆధీనంలో ఫారెస్ట్ భూమి ఉంది. సన్న కారు రైతులను ఇబ్బందులకు గురి చేయడం లేదు. ఐదు ఎకరాలలోపు పోడు వ్యవసా యం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నప్పటికీ కొంతమంది ఆందోళన చేస్తు న్నారు. 5 ఎకరాలపైన భూమి ఉన్న వారి నుండి స్వాధీన పరచుకొని ప్లాంటేషన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అత్యధికంగా భూమి ఉన్న రైతు ల సహకరించి సామరస్య పద్ధతి లో వ్యవసాయం చేసుకోవాలని కోరుతున్నాను.

 నీరజ్ కుమార్ టిబ్రేవాల్,

జిల్లా అటవీశాఖ అధికారి