25-06-2025 08:18:40 AM
తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanam) బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో(Tirumala) టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి(Srivari Sarva Darshan) 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు ప్రకటించారు. శ్రీవారి సర్వదర్శనం కోసం 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 79,466 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 29,227 మంది భక్తులు మంగళవారం శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమల క్షేత్రంలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.