calender_icon.png 30 June, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగులకు పదవీ విరమణ సహజం

29-06-2025 09:53:45 PM

ఏఎస్ డబ్ల్యూఓ రవీందర్..

లక్షేట్టిపేట (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ సహజమని అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్ గౌడ్(Assistant Social Welfare Officer Ravinder Goud) అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎస్సీ బాలుర వసతి గృహాంలో నిర్వహించిన ఉద్యోగి పదవీ విరమణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించే క్రమంలో ప్రతి ఉద్యోగి ఎంతో కష్టపడి పనిచేయాల్సి ఉంటుందన్నారు. అంకిత భావంతో సుమారు 35 ఏండ్లు సర్వీస్ ను పూర్తి చేసుకోవడంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకోవాల్సి ఉంటుందన్నారు. హాస్టల్ విద్యార్థులకు బోనగిరి సుక్కమ్మ అందించిన సేవలు మరువలేనివన్నారు.

అంతకుముందు ముఖ్య అతిధిగా హాజరైన రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగం ముఖ్యంగా వసతి గృహ విధుల నిర్వహణ కత్తిమీద సాము అని వివరించారు. విద్యార్థులకు మంచి ఆహరం అందించే క్రమంలో వంట మనిషి బాధ్యత ఎంతో ముఖ్యమైనదని వివరించారు. అనంతరం పలువురు వసతి గృహ సంక్షేమాధికారులు ఉద్యోగ నిర్వహణలో గల బాధ్యతలు సవాళ్ళ గురించి వివరిస్తూ రిటైర్మెంట్ వరకు పని చేయడం గర్వకారణమన్నారు. అనంతరం సుక్కమ్మ - లింగయ్య దంపతులను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమాధికారులు రాజు, రాజ గోపాల్, శ్రీనివాస్, కిషోర్, ప్రశాంత్, కుమార్, సునీత రాణి, సద్గుణ, గోపాల్, వసతి గృహ సిబ్బంది జానీ, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.