calender_icon.png 30 June, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తన ఉనికి చాటుకోవడానికి మా నాయకునిపై ఆరోపణలు..

29-06-2025 09:57:49 PM

మహదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు..

మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): తన ఉనికిని చాటుకోవడానికి మా నాయకుడిపై ఆరోపణలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఇకనైనా మానుకోవాలని తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు(Black Congress President Kota Rajababu) అన్నారు.  జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మంథిని శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu)పై హైదరాబాదులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. శ్రీధర్ బాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని మంథని నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని నటిస్తున్నాడని ఆరోపణలు చేశారు.

ఈ  ఆరోపణల అన్నింటిని మహదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ తరపున ఖండిస్తూ మా నాయకుడు రాష్ట్ర అభివృద్ధి కాంక్షిస్తూ మంథని నియోజకవర్గ అభివృద్ధి చేస్తూ అన్ని రకాల పనులు చేస్తున్నాడని మంథని పట్టణము చుట్టు రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేశారని, రూ. 120 కోట్లతో మంథిని నుండి చెన్నూరు నియోజకవర్గాన్ని కలుపుతూ గోదావరిపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారని, మంథని నియోజకవర్గంలో ఒక్కొక్క అభివృద్ధి పనులను పూర్తిస్థాయిలో చేస్తూ అన్ని రకాలుగా మంథిని ప్రాంతాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అక్బర్ ఖాన్, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ చల్ల తిరుపతయ్య, మాజీ ఎంపీపీ రాణి బాయి, మాజీ కాలేశ్వరం దేవస్థానం చైర్మన్ వామన్ రావు, కోట సమ్మయ్య, యూత్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.