18-06-2025 12:00:00 AM
టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి
సదాశివపేట, జూన్ 17 :సదాశివపేట మండలంలోని ఆత్మకూరు గ్రామంలో అమ్మమాట.. అంగన్వాడి బాట అనే కార్యక్రమం అంగన్వాడి సూపర్వైజర్ లింగమని ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి హాజర య్యారు. నిర్మల జగ్గారెడ్డి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన, సరస్వతి దేవి పూజ నిర్వహించారు.
ఆత్మకూరు గ్రామంలో మొదటిసారి అంగన్వాడికి వస్తున్నటువంటి 36 మంది పిల్లలకు స్వయం గా టీజీఐఐసీ చైర్మన్ చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. అంగన్వాడీలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం గురించి పిల్లల తల్లిదం డ్రులను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీలో చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ రాంరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్ధన్న, సదాశివపేట పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ, ఎంఈఓ శంకర్, అంగన్వాడీ సూపర్వైజర్లు, పంచాయతీ సెక్రెటరీ మౌనిక, మాజీ సర్పంచ్ గంగన్న, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.