26-05-2025 08:04:17 PM
బీఆర్ఎస్ నాయకులపై లాఠీ ఛార్జ్ అమానుషం..
బీఆర్ఎస్ నాయకులకు ఒక తీరు కాంగ్రెస్ నాయకులకు ఒక తిరుల వ్యవహరిస్తున్న పోలీసులు..
ప్రజాస్వామ్యాన్ని కలరాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్..
చొప్పదండి: పాలన చేతకాక కేటీఆర్ ఆఫీస్ మీద దాడి చేస్తున్న కాంగ్రెస్ నాయకుల్లారా మీ ఎంపీల ఆఫీస్ లలో ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆఫీస్ లో ప్రధానమంత్రి మోదీ ఫోటో ఉందా అని గుర్తు చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్రంగా ఖండించారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ పాలకులు ఈవిధమైన దాడులను ప్రోత్సహిస్తూ "డైవర్షన్ పాలిటిక్స్" పాల్పడుతూ ప్రజాస్వామ్య విలువలను పాతరేస్తున్నారని, ఆయన స్థానిక శాసనసభ్యుడి అధికారిక క్యాంపు కార్యాలయంపై దాడికి దిగిన కాంగ్రెస్ గుండాలను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అత్యుత్సాహం కనబర్చి లాఠీలతో చితకబాదడం శోచనీయమని తెలిపారు. క్యాంపు కార్యాలయంపై దాడికి దిగిన కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని రవిశంకర్ పోలీస్ అధికారులను డిమాండ్ చేశారు.