6 July, 2026 | 1:09 PM

Breaking News

సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •   ప్రియ మిల్క్ పార్లర్ ప్రారంభించిన డిప్యూటీ మేయర్   •   7 ఎకరాలలోపు రైతులకు 'రైతుభరోసా' నిధులు విడుదల   •   ములుగు జిల్లాలో భారీ చోరీ   •   సాయి నగర్ మురికి కాలువ లో ముళ్ళ పొదల తొలగింపు   •  

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

26-05-2025 08:11 PM

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్..

మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రజల నుంచి ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(Mahabubabad District Collector Adwait Kumar Singh) ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాలను ప్రజల నుంచి విజ్ఞప్తిలో స్వీకరించారు. అధికారులు తమ పరిధిలో తీర్చలేక సమస్యలకు పరిష్కారం చూపాలని, లేని పక్షంలో సంబంధిత విభాగాల అధికారులతో సమన్వయ పరుస్తూ దరఖాసుదారులకు దిశా నిర్దేశం చేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

ఈ సందర్భంగా 122 దరఖాస్తులు వివిధ శాఖలకు సంబంధించి వచ్చాయి. అనంతరం జిల్లా స్థాయి అధికారులతో ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ పిడి మధుసూదన్ రాజ్, డిసిఓ వెంకటేశ్వర్లు, సిపిఓ సుబ్బారావు, డిఏఓ విజయ నిర్మల, డిపిఓ హరిప్రసాద్, మైనారిటీ వెల్ఫేర్ అధికారి శ్రీనివాస్ డిహెచ్ఓ మరియన్న, గ్రౌండ్ వాటర్ డిడి సురేష్, వివిధ శాఖ అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.