17 April, 2026 | 2:28 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

26-05-2025 08:11 PM

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్..

మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రజల నుంచి ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(Mahabubabad District Collector Adwait Kumar Singh) ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాలను ప్రజల నుంచి విజ్ఞప్తిలో స్వీకరించారు. అధికారులు తమ పరిధిలో తీర్చలేక సమస్యలకు పరిష్కారం చూపాలని, లేని పక్షంలో సంబంధిత విభాగాల అధికారులతో సమన్వయ పరుస్తూ దరఖాసుదారులకు దిశా నిర్దేశం చేసి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

ఈ సందర్భంగా 122 దరఖాస్తులు వివిధ శాఖలకు సంబంధించి వచ్చాయి. అనంతరం జిల్లా స్థాయి అధికారులతో ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ పిడి మధుసూదన్ రాజ్, డిసిఓ వెంకటేశ్వర్లు, సిపిఓ సుబ్బారావు, డిఏఓ విజయ నిర్మల, డిపిఓ హరిప్రసాద్, మైనారిటీ వెల్ఫేర్ అధికారి శ్రీనివాస్ డిహెచ్ఓ మరియన్న, గ్రౌండ్ వాటర్ డిడి సురేష్, వివిధ శాఖ అధికారులు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.