రేవంతన్నా.. నా గుండుతో ఏం పని?

01-05-2024 12:49:10 AM

ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తేల్చండి..

బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి తన ఆహార్యంపై చేసిన వ్యాఖ్యలపై మంగళ వారం రాత్రి ఎల్లారెడ్డిపేట, ముస్తా బాద్, సిరిసిల్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ‘రేవంతన్నా.. నా గుండుతో మీకేం పని? ముందు రైతులు పండించిన ధాన్యానికి రూ.500 బోనస్, ఆడ పిల్లల పిల్లలకు తులం బంగారం, వృద్ధులు, దివ్యాంగులకు రూ.4 వేల పింఛను ఏమైంది..’ అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి దమ్ముం టే ఇచ్చిన ఎన్నికల హామీ లను ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు.