09-05-2025 02:09:14 AM
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
హుజూర్ నగర్, మే 08: భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. భూ భారతీ పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులో భాగంగా గురువారం వెలిదండ గ్రామం లో నిర్వహించిన సదస్సులలో కలెక్టర్ పాల్గొని రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్ డెస్క్ తదితర వాటిని సందర్శించి, రైతుల నుండి అర్జీలు స్వీకరిస్తున్న తీరును పరిశీలించారు. సదస్సులో వారి సమస్యలను అడిగి తెలుసుకుని సందేహాలను నివృత్తి చేశారు.
ఈ సందర్భంగా భూభారతి విధివిధానాల గురించి వివరిస్తూ, భూ సంబంధిత సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన మీదట నిర్ణీత గడువులోపు సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు .
ప్రస్తుతం పైలెట్ ప్రాతిపదికన గరిడేపల్లి మండలంలో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు ముగిశాక, జిల్లాలోని మిగితా మండలాల్లో గల అన్ని రెవెన్యూ గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుం దన్నారు.
గురువారం జరిగిన రెవెన్యూ సదస్సులో గానుగ బండలో 69 దరఖాస్తులు, వెలిదండలో సదస్సులో 269 దరఖాస్తులు రైతుల నుండి స్వీకరించటం జరిగిందన్నారు.ఈ సదస్సులలో హుజూర్నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, డీఎవో రాజేందర్ రెడ్డి,తాసిల్దార్ క విత,ఏఆర్ఐ రాంబాబు ఎమ్మారై ప్రవీణ్ , రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.