calender_icon.png 7 June, 2025 | 9:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

06-06-2025 12:26:27 AM

  1. లబ్ధిదారులు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి....

సన్నబియాన్ని పద్ధతి ప్రకారంగా పంపిణీ చేయాలి:  బి.యం.సంతోష్

గద్వాల, జూన్ 5 ( విజయక్రాంతి ) : భూ సమస్యల శా శ్వత పరిష్కారానికి చేపట్టిన భూభారతి చట్టం అమలులో భా గంగా జరుగుతున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బి.యం.సంతోష్ అన్నారు. గురువారం ధరూర్ మండలం అల్వలాపాడు గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు.రైతులతో ముఖాముఖి మాట్లాడి,వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రైతు గుర్తిం పు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలన జరిపి,అధికారులకు పలు సూచనలు చేశారు.అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు భూ సంబంధిత సమస్యలు ఉన్న వారు నిర్ణీత ప్రొఫార్మా లో సరైన విధంగా దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు.. 

లబ్ధిదారులు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి ....

ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులకు ఆదేశించారు. గు రువారం అల్వాలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులను,క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలె క్టర్ మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి వివ రాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ యాప్ లో నమోదు చేస్తూ లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం వెంటనే అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

సన్నబియాన్ని పద్ధతి ప్రకారంగా పంపిణీ చేయాలి 

రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సన్నబియాన్ని పద్ధతి ప్రకారంగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ సూచించారు. గురువారం ధరూర్ మండలం అల్వాల్ పాడు గ్రామంలో రేషన్ షాప్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.షాపులో స్టాక్ నమోదుకు సంబంధించి రిజిస్టర్,ఈ-పాస్ యంత్రం వినియోగం,బయోమెట్రిక్ విధానం,లబ్ధిదారుల సంఖ్య, బియ్యం నిల్వ,బియ్యం తూకం సరిగ్గా ఉందా లేదా,బియ్యం పంపిణీ సమయంలో లబ్ధిదారులకు ఎలా అందిస్తున్నారని వివరంగా పరిశీలించారు.

బియ్యా న్ని స్వయంగా చేతుల్లోకి తీసుకుని నాణ్యతను పరిశీలించారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరుకులు పంపిణి చేయాలన్నారు.సరుకు పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా, స మర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరేందర్,డీలర్ శశికళ,సంబంధిత అధి కారులు, తదితరులు పాల్గొన్నారు.