calender_icon.png 18 June, 2025 | 9:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనింగ్, కార్మిక శాఖ మంత్రిని కలిసిన నాయకులు

18-06-2025 12:00:00 AM

పటాన్ చెరు, జూన్ 17 :మైనింగ్, కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో గడ్డం వివేక్ వెంకటస్వామిని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక నాయకులు వి.వరప్రసాద్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం మంత్రికి విన్నవించినట్లు వరప్రసాద్ రెడ్డి తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో లఖన్ సింగ్, ఉద్యానంద్, ధర్మేందర్ యాదవ్, ఉమాకాంత్, తివారీ తదితరులు పాల్గొన్నారు.