16-06-2025 12:47:10 AM
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని కేంద్ర నైపుణ్యాభివృద్ధిశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి పేర్కొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవా యి దిలీప్కుమార్తో కలిసి శుక్రవారం ఆయన హైదరాబాద్లో పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు.
తెలంగా ణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఆర్ఎల్డీ కీలక పాత్ర పోషించిందని, తాను కూడా ప్రతక్ష్యంగా ఉద్యమంలో పాల్గొన్నానని గు ర్తుచేసుకున్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఎంతో కృషి చేశారని, రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. రాష్ట్ర ప్రభు త్వం సినీ పరిశ్రమకు గద్దర్ పేరిట అవార్డులు ప్రదానం చేయడం అభినందనీయ మని కితాబునిచ్చారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన కపిలావాయి దిలీప్కుమార్ రాష్ట్రప్రజ లందరికీ సుపరిచితుడని, ఆయన నేతృత్వం లో పార్టీ కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో యూపీ, రాజస్థాన్, హర్యానా ప్రజలు కూ డా ఉన్నారని, అందరూ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. తెలంగాణలో ఆర్ఎల్డీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు.
రైతులు, నిరుద్యోగ సమస్యలు, సామాజిక న్యా యం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్కుమార్ మాట్లాడుతూ.. తమ పార్టీ పక్కా రైతుల పార్టీ అని, రైతు సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుందన్నారు. కొట్లాడి తె చ్చుకున్న తెలంగాణలో ప్రజల బతుకులేమీ మారలేదని అభిప్రాయపడ్డారు.
పార్టీ జాతీ య మహిళా అధ్యక్షురాలు ఇందిరా మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలేవీ నెరవేరలేదని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తమ పార్టీ కృషి చేస్తుం దన్నారు. కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కిన్నెర సిద్ధార్థ్, ఇతర నేతలు గిరి కుండే, విశాల్ వంజారి, మల్లేశ్ గౌడ్, రుషబ్ జైన్, ఓంకార్ గౌడ్, మడకం ప్రసాద్, నునే భాస్కర్రావు, నరసింహారావు, కోరె సాయి రాం తదితరులు పాల్గొన్నారు.