16-06-2025 12:50:42 AM
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్టెక్ సదుపాయాలను అందించే దిశగా ప్రభు త్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో ముందుకుసాగుతోంది. ఇందులో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఆరు ప్రముఖ సంస్థలతో సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో ఎంవోయూ కుదుర్చుకున్నది.
ఆయా సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన సదుపాయాలను అందించనున్నది. ఇందుకుగానూ నందన్ నిలేకని నేతృత్వంలోని ఎక్స్టెప్ ఫౌం డేషన్, డాక్టర్ సునీతాకృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్పాండే అధ్వర్యంలోని ఫిజిక్స్వాలా, ఖాన్ అకాడమీ, షోయ బ్దార్ నిర్వహిస్తున్న పైజామ్ ఫౌండేషన్, సఫీనా హుస్సేన్ అధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్లాంటి పేరొందిన సంస్థలతో విద్యాశాఖ ఎంవోయూ కుదుర్చుకున్నది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పేరొందిన సంస్థల భాగస్వామ్యంతో రాష్ర్ట విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావొచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ర్టంలో విద్యా నాణ్యత ప్ర మాణాలను మెరుగుపరచాలన్న సీఎం రేవంత్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.
ఆయా సంస్థలు సేవలు..
నందన్ నిలేకని నేతృత్వంలోని ఎక్స్టెప్ ఫౌండేషన్ కృత్రిమ మేథ ఆధారిత ప్లాట్ఫామ్తో 540 పాఠశాలల్లో పని చేస్తుంది. ఇకపై 33 జిల్లాల పరిధిలో 5,000కి పైగా ప్రాథమిక పాఠశాలలకు విస్తరించనుంది. మూడో తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్ భాషలతో పాటు మ్యాథ్స్ బేసిక్స్ను ఈ సంస్థ అందిస్తుంది. ఫిజిక్స్వాలా సంస్థ ఇంటర్ విద్యార్థులకు నీట్, జేఈఈ, క్లాట్ పరీక్షలకు సన్నద్ధులను చేస్తుం ది.
పాఠశాల స్థాయి నుంచే పోటీపరీక్షల దృక్కోణంలో విద్యార్థులకు ఉచిత శిక్షణ అం దిస్తుంది. ఖాన్ అకాడమీ రాష్ర్టంలో 6వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు పా ఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో ఆధారిత స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) శిక్షణను అందిస్తుంది. డాక్టర్ సునీతాకృష్ణన్ నేతృత్వంలో ప్రజ్వల ఫౌండేషన్ 6వ తరగతి నుంచి క్లాస్ 12 వరకు విద్యార్థులకు రాష్ర్టవ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తుంది.
పైజామ్ ఫౌండేషన్ ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు కోడింగ్, కంప్యూ టేషనల్ థింకింగ్పై శిక్షణ అందిస్తుంది. ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ రాష్ర్టంలో పాఠశాలలకు దూరంగా ఉన్న 16వేలకు పైగా పిల్లల ను తిరిగి బడిలో చేర్పించటంతో పాటు, బాలికల అక్షరాస్యత, విద్యా అవకాశాలను మెరుగుపరుస్తుంది.
ఈ కార్యక్రమంలో ప్ర భుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్రెడ్డి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెం ట్ స్పెషల్ సెక్రటరీ హరిత, ఎక్స్టెప్ ఫౌండేషన్ సీఈవో జగదీశ్బాబు, ప్రజ్వల ఫౌం డేషన్ చీఫ్ డా.సునీతాకృష్ణన్, ఫిజిక్స్ వాలా కో-ఫౌండర్ ప్రతీక్ మహేశ్వరి, ఖాన్ అకాడమీ ఇండియా ఎండీ స్వాతి వాసుదేవన్, పైజామ్ పౌండేషన్ ఫౌండర్ షోయబ్ దార్, ఎడ్యుకేట్ గర్ల్స్ సీఈవో గాయత్రి నాయిర్ లోబో తదితరులు పాల్గొన్నారు.