17 April, 2026 | 2:48 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

అప్పుల బాధతో ఆర్‌ఎంపీ డాక్టర్ ఆత్మహత్య

10-06-2025 12:24 AM

చేగుంట, జూన్ 9 : అప్పుల బాధ  భరించలేక ఆర్‌ఎంపి వైద్యుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసాయిపేట్ మండలం  పోతన్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బర్రె మహేష్ (30) గత కొంతకాలం నుండి తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఆర్‌ఎంపీ డాక్టర్ గా పనిచేస్తున్నాడు.  కొంతకాలంగా బంధువులు, స్నేహితుల దగ్గర సుమారు రూ.13 లక్షల మేరకు అప్పులు చేశాడు.

చేసిన అప్పులు భారంగా మారి తీర్చలేక తన వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగినట్లు తెలిపారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు మెరిగైన చికిత్స నిమిత్తం  గాంధీ ఆసుపత్రికి తరలించగా ఆదివారం రాత్రి మరణించినట్లు తెలిపారు, విషయం తెలుసుకున్న చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.