ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, జూన్ 9 (విజయక్రాంతి) : రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులపై ప్రత్యేక శ్రద్ద పెట్టి పరిష్కరించాలని అధికారులకి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజా వాణిలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొన్ని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకి సేవ చేయటమే ఉద్యోగుల భాద్యత అని, అధికారులు ప్రజల కొరకు అందుబాటులో ఉండి పని చేయాలని ఒకవేళ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు. తదుపరి ప్రజావాణిలో భూ సమస్యలకి సంబందించి 31, ఎంపిడిఓలకి 11, హొసింగ్ శాఖకి 4,సంక్షేమ శాఖకి సంబంధించి 3, మిగిలినా 15 దరఖాస్తులు వివిధ శాఖలకి సంబంధించి వచ్చాయని మొత్తం 64 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. డి ఆర్ డి ఓ పి డి వి వి అప్పారావు, డిఇఓ అశోక్, డి పి ఓ యాదగిరి,సిపిఓ కిషన్,డి డబ్ల్యూ ఓ నరసింహారావు, డి సి ఓ పద్మ వెల్ఫేర్ డీఎవో శ్రీధర్ రెడ్డి సంక్షేమ అధికారులు శంకర్ శ్రీనివాస్ నాయక్ జగదీశ్వర్ రెడ్డి, గఅధికారులు, సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.






