21 August, 2026 | 4:34 PM

Breaking News

తంగళ్లపల్లి ఎస్‌హెచ్‌ఓ సిరిసిల్ల అశోక్ బాధ్యతల స్వీకరణ   •   పాఠశాల ప్రిన్సిపాల్ రూపా రెడ్డి ఘటనపై ఉట్నూర్ ఏఎస్పీ భరసా   •   సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు   •   హల్ద్వానీ ఘటనపై మంథనిలో కాంగ్రెస్ నిరసన   •   అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం: మార్కెట్ చైర్మన్   •   రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ   •   సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం   •   విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినియోగదారుల వినతి   •   ఏఐవైఎఫ్ తాండూర్ మహాసభలను జయప్రదం చేయండి   •  

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

14-06-2024 11:02 AM

అమరావతి: కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం సీతనపల్లి గ్రామంలో శుక్రవారం ఘోర ప్రమాదం సంభవించింది.  రెండు లారీలు ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించి ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. రెండు లారీల డ్రైవర్లతో పాటు మరో నలుగురు మృత్యువాత పడ్డారు. ఘటనాస్థలిలో ఐదుగురు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతిచెందారు. మృతుల్లో ఐదుగురు కోనసీమ జిల్లా తాళ్లరేవు వాసులుగా గుర్తించామని మచిలీపట్నం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) సుభానీ తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.