15-06-2025 12:07:13 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 1౪ (విజయక్రాంతి): వర్షాకాలం ప్రారంభమైనా హైదరాబాద్ నగరంలో రోడ్ల తవ్వకాలు ఆగడంలేదు. జలమండలి పైపులైన్ పనులు, డ్రైనేజీ, కేబుల్స్, ఎలక్ట్రిసిటీ కేబుల్స్ ఏర్పాటు కోసం నిత్యం రోడ్లను తవ్వుతున్నారు. ప్రధాన రహదారుల నుంచి మొదలుపెడితే అంతర్గత రోడ్ల వరకు ఇదే పరిస్థితి ఏర్పడింది. వర్షాకాలంలో రోడ్ల తవ్వకాలకు అనుమతి లేదని ఓ పక్కన జీహెఎంసీ అధికారులు చెపుతున్నప్పటికీ ప్రస్తుతం చాలా చోట్ల రోడ్ల తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి.
పనులు పూర్తయిన చోట కాంట్రాక్టర్లు తిరిగి రోడ్లు వేయకుండా వదిలేస్తుండటంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఆ కాంట్రాక్టర్తో రోడ్డు వేయిం చాల్సిన అధికారులు పట్టించుకోవడంలేదు. కేవలం మట్టిపోసి వదిలేస్తుండటం తో వర్షాలు పడిన సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు తవ్వే ముందు బల్దియా నుంచి ఎన్వోసీ తప్పనిసరి తీసుకోవాల్సి ఉంది.
వర్షాకా లం నేపథ్యంలో ఎటువంటి తవ్వకాలకు అనుమ తులు లేవు. అయినా కూడా ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే అడ్డగోలుగా రోడ్లు తవ్వుతున్నారు. కొన్నిచోట్ల రాత్రికిరాత్రి రోడ్లను తవ్వి పనులు చేసుకొని వదిలేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నది.
ఎన్వోసీల విషయంపై బల్దియా అధికారులు తమకేమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. జూబ్లీహిల్స్ సర్కిల్లో ఐదారు ప్రాంతాల్లో వాటర్ బోర్డు, కేబుల్ పనులు చేశారు. పనులు పూర్తయిన చోట తిరిగి రోడ్డు వేయకపోవడంతో ఇదే విషయంపై జలమండలికి కొన్ని రోజుల క్రితం జీహెచ్ ఎంసీ అధికారులు లేఖ రాశారు.
నామ్ కే వాస్తేగా ఎన్వోసీలు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
ప్రధాన రోడ్ల నుంచి కాలనీలకు వెళ్లే రోడ్లను ఏదో ఒక పని పేరుతో కాంట్రాక్టర్లు తవ్వుతూనే ఉన్నారు. చాలాచోట్ల రోడ్లు తవ్వి రోజులు గడిచినా మరమ్మతులు చేయడం లేదు. బల్దియా అధికా రులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నా రు. ఫిలింనగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్టు వైపు వెళ్లే రోడ్డులో పనులు చేసి నెలలు అవుతున్న తిరిగి రోడ్డు వేయలేదు.
కేబీఆర్ పార్కు నుంచి బసవ తార కం వచ్చే రోడ్డులో కూడా ఇలాగే వదిలేశారు. సోమాజిగూడ ప్రధాన రోడ్డుపై, ఎమేల్యె కాలనీలో ఇంకా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. కాంట్రా క్టర్ రోడ్లు వేయకపోతే ఆ పనికి సంబంధించి బిల్లు లు ఆపే అధికారం అధికారులకు ఉం టుంది. కానీ ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదే అలుసుగా కాంట్రాక్టర్లు రోడ్లు బాగు చేయకుండానే చేతులు దులుపుకుంటున్నారు.
తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్య
సిటీలో రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతుండటంతో అంతర్గత రోడ్ల నుంచి మళ్లిస్తున్నారు. దీంతో అంతర్గత రోడ్లపై కూడా ట్రాఫిక్ జాం ఏర్పడుతున్నది. గత రెండేళ్లుగా అంతర్గత రోడ్ల వినియోగంపై ట్రాఫి క్ పోలీసులు ఆసక్తి చూపుతున్నారు. అయితే అభివృద్ధి పనుల పేర అంతర్గత రోడ్లను తవ్వి వదిలేయడంతో గల్లీల్లో వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.