20-06-2025 08:49:25 PM
పాపన్నపేట: వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను తప్పకుండా పాటించాలని ఎస్సై శ్రీనివాస్ గౌడ్(SI Srinivas Goud), ఏఎంవీఐ శ్రీనివాసరావు(AMVI Srinivasa Rao) అన్నారు. శుక్రవారం మండలంలోని ప్రైవేటు పాఠశాలల బస్సులను తనిఖీ చేశారు. నార్సింగి, పాపన్నపేటలో కలిపి మొత్తం ఐదు బస్సులను తనిఖీ చేసి బస్సుల ధ్రువపత్రాలను పరిశీలించారు. నిబంధనల ప్రకారం అన్ని పత్రాలను సరిగా ఉంచుకోవాలన్నారు. డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.