30-09-2025 05:53:20 PM
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 37 ఏళ్ల ప్రయాణీకుడి ప్రాణాలను ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అంకితభావంతో కాపాడారు. ఇబ్రహీంపట్నంలోని మన్నెగూడకు చెందిన ప్రవీణ్ కుమార్(37) ఉదయం 5.30 గంటల ప్రాంతంలో కదులుతున్న ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు ప్రయత్నించి రైలు ప్లాట్ఫారమ్ మధ్య జారిపడటాన్ని అక్కడే విధులు నిర్వయిస్తున్న కానిస్టేబుల్ గమనించారు. తన అద్భుతమైన ధైర్యం, శీఘ్ర ఆలోచనను ప్రదర్శించి ప్రయాణీకుడిని సురక్షితంగా పైకి లాగి, ప్రాణాంతక ప్రమాదాన్ని నివారించాడు.
కానిస్టేబుల్ చేసిన సాహసని సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఎ.నవీన్ కుమార్, ఇన్స్పెక్టర్ సర్శ్వత్ సహా సీనియర్ అధికారులు ప్రశంసించారు. కానిస్టేబుల్ ధైర్యం, విధి పట్ల అంకితభావం ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడంలో ఆర్పీఎఫ్ సిబ్బంది నిబద్ధతకు ఒక ఉదాహరణ అన్నారు. ఈ సంఘటన "ఆపరేషన్ జీవన్ రక్ష" చొరవ ప్రాముఖ్యతను తెలియజేస్తుందన్నారు. ఇది ఆర్పీఎఫ్ సిబ్బంది ధైర్యం, నిస్వార్థ చర్యలను గుర్తించి వారికి బహుమతులు ఇస్తుందని వారు తెలిపారు. కానిస్టేబుల్ చర్యలు ప్రత్యేక గుర్తింపు, ప్రశంసలకు అర్హమైనవని నవీన్ కుమార్ ప్రకటించారు.