calender_icon.png 28 June, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ గురుకులాలకు రూ.67 కోట్లు

28-06-2025 01:48:12 AM

- గీత కార్మికులకు రూ.17 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు 

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలకు రూ. 67.51 కోట్ల నిధులను, గీత కార్మికులకు రూ. 17 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ గురుకుల సంస్థలోని హైస్కూల్ కమ్ జూనియర్ కాలేజీలకు సంబంధించిన పెండింగ్ బిల్లుల కింద నిధు లను విడుదల చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. గీత కార్మికుల కోసం విడుదల చేసిన నిధులను తెలంగాణలో గీత కార్మికుల సహకార ఫైనాన్స్ కా ర్పొరేషన్‌కు కేటాయిస్తున్నట్టు స్పష్టం చేసింది.