calender_icon.png 5 January, 2026 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల సమ్మెకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు

04-01-2026 09:36:07 AM

బెజ్జూర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిన అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని మున్సిపల్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమ్మెలో భాగంగా కార్మికులు వెంటనే జీతాలు చెల్లించాలని నిరసన తెలుపుతూ మున్సిపాలిటీ కార్యాలయం ముందు నిద్రిస్తుండగా కార్మికులతో కలిసి బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిద్రించి నిరసన తెలిపారు.  ప్రభుత్వ మొండివైఖరి నశించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు .కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించి మున్సిపల్ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.