పెంచికలపేటలో మొరాయించిన ఆర్టీసీ బస్సు
29-10-2025 11:14 AM
ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు
ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణీకుల ప్రయాణం
మంథని,(విజయ క్రాంతి): పెద్దపెల్లి జిల్లా కమాన్ పూర్ మండలం లోని గోదావరిఖని-పెద్దపెల్లి ప్రధాన రహదారి పెంచికలపేట పెట్రోల్ బంక్ వద్ద ఆర్టీసీ బస్సు బుధవారం మొరాయించింది. దీంతో బస్స్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక చేసేదేమీ లేక ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణీకులు వెళ్లాల్సి వచ్చింది.






