15 June, 2026 | 7:49 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

ఆర్టీసీ బస్సు బీభత్సం.. చక్రాల కింద ఇరుక్కున్న వ్యక్తి

03-06-2026 03:25 PM

హైదరాబాద్: సికింద్రాబాద్ జూబ్లీ బస్‌ స్టేషన్‌(Jubilee Bus Station) వద్ద బుధవారం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు శివ బస్సు టైర్ల కింద ఇరుక్కుపోయాడు. గమనించిన మారేడుపల్లి ట్రాఫిక్ పోలీసులు, వాహనదారులు తక్షణమే అప్రమత్తమమై శివను కాపాడారు. ఈ ప్రమాదంలో బస్సు కింద పడిన శివకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో బస్సును పక్కకు జరిపారు. బస్సు జేబీఎస్‌ నుంచి కార్ఖానా వైపు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోటుచేసుకుంది