04-06-2025 10:49:20 AM
మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలోని అన్నారం, ఉప్పరపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ( Bhu Bharathi conference) సదస్సులను మహబూబాబాద్ ఆర్డిఓ కృష్ణవేణి సందర్శించారు. రైతుల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తుల తీరును పరిశీలించారు. రైతులకు సంబంధించిన భూ సమస్యలపై అవగాహన కల్పించి, దరఖాస్తులు చేయడానికి అవసరమైన సహాయం చేసేందుకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, రైతులు తమ భూములకు సంబంధించిన దరఖాస్తులను సదస్సులో అందిస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేసముద్రం తహసిల్దార్ వివేక్, ఉప తహసిల్దార్ ఎర్రయ్యలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు సదస్సు వద్ద ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.