24-11-2025 05:33:29 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని పాత బజార్ లో గల శివాలయంలో సోమవారం కొమురవెల్లి రామ్మూర్త సత్తెమ్మ దంపతులు వారి కుమార్తె అల్లుడు గోదావరిఖని వాస్తవ్యులు శ్రీనివాస్ వరలక్ష్మి దంపతులు స్వామివారికి పలు రకాల పండ్లతో రుద్రాభిషేకం ఘనంగా చేయడం జరిగింది. ఆలయ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వల్ల కొండ మఠం మహేష్, దంపతులచే ప్రత్యేక పూజలు చేయించారు. శివాలయం భక్త బృందం పాల్గొన్నారు.