calender_icon.png 24 November, 2025 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థినిలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

24-11-2025 05:30:54 PM

షీ టీం అవగాహన సదస్సులో స్నేహలత

సుల్తానాబాద్ (విజయక్రాంతి): విద్యార్థినిలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని షీ టీం మెంబెర్ స్నేహలత సూచించారు. రామగుండం సి.పి ఆదేశాల మేరకు షీ టీమ్ ఇంచార్జి ఎస్సై లావణ్య ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో విద్యార్థులకు షీ టీం అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం మెంబర్ స్నేహలత మాట్లాడుతూ మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలపై, యాంటీ డ్రగ్స్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఎవరైనా చెడు గా మాట్లాడిన, ప్రవర్తించిన తల్లిదండ్రులకు తెలియజేయాలని, వాటి నుంచి ఎలా బయటపడటంపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మహిళల రక్షణ కోసం ప్రతి రోజు బస్టాండ్ ప్రధాన చౌరస్తాలో జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిరంతరంగా నిగా ఉంచడం జరుగుతుందని, ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్ కు ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే అత్యాశకు పోయి సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు ,లోన్ యాప్స్ గురవుతున్నారని వాటికి జోలికి పోకుండా ఉండాలని, ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే  సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కి  సమాచారం ఇవ్వాలని, అలాగే మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే, బెదిరింపులకు గురైతే వెంటనే 100 నంబర్ కు డయల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ, షీ టీమ్ సభ్యులు మౌనిక, సురేష్, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.