calender_icon.png 2 June, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమలలో భక్తుల రద్దీ.. రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం

01-06-2025 08:44:52 AM

తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanams) భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం నాడు రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారిని భక్తులకు దర్శనం చేసుకున్నారు. శ్రీవారిదర్శన విధానం వచ్చిన తరువాత అత్యధిక మంది భక్తులకు తిరుమల దేవస్థానం దర్శనం కల్పించింది. శ్రీవారి సర్వదర్శనం(Srivari Sarva Darshan) కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం(Silathoranam) వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోనెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు ప్రకటించారు. 95,080 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకోగా, 39,668 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం  3.47 కోట్లు వచ్చినట్లు టీటీడీ(TTD) ఆదివారం ప్రకటించింది.