16-06-2025 01:14:12 AM
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): జాతీయ నైపుణ్య శిక్షణ కింద యంగ్ ఇండి యా స్కిల్ యూనివర్సిటీకి మద్దతు ఇవ్వాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరికి సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రె డ్డి నివాసంలో ఆయనతో కేంద్రమంత్రి స మావేశమయ్యారు.
ఈసందర్భంగా రాష్ర్టం లో వీఎఫ్ఎక్స్, గేమింగ్, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేంద్రమంత్రి జయంత్ చౌదరి సూచించారు. ఐటీఐ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఉపయో గపడుతుందని పేర్కొన్నారు. తాము ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివ ర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ఏర్పాటు చేసి.. దానిని ఐటీఐలకు అనుసంధానిస్తామని ముఖ్యమంత్రి కేంద్రమంత్రికి తెలియ జేశారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డిని కేంద్రమంత్రి అభినందించారు. ఐటీఐలన్నింటికీ ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని కేంద్రమంత్రి సీఎంను కోరారు. ఐటీఐల్లో సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పా టు చేయాలని సీఎం వెంటనే అధికారులను ఆదేశించారు. ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లు కాలానుగుణంగా ఐటీఐల్లో సిలబస్ను అప్గ్రేడ్ చేయాలని..
ఇందుకోసం ప్రత్యేక కమిటీ నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశిం చారు. సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్రెడ్డి, సీఎంవో పరిశ్రమలు, పెట్టుబడుల విభాగం సీఈవో జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు.