calender_icon.png 6 June, 2025 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర ప్రణాళికతో రాష్ట్ర అభివృద్ధి

03-06-2025 12:27:23 AM

రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి

కామారెడ్డి, జూన్ 2 (విజయ క్రాంతి), రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పక్క ప్రణాళికతో అభివృద్ధిలో ముందుకు వెళుతున్నట్లు రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర అవతరణ దినోత్సవాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వేడుకల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర 11వ అవతరణ దినోత్సవానికి విచ్చేసిన ప్రజా ప్రతినిధులకు, ఇతర ప్రముఖులకు, జిల్లా అధికారులకు, అనధికారులకు, పత్రికా విలేఖరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి  నా హృదయ పూర్వక నమస్కారాలు అని తెలిపారు.

రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలుపంచుకున్న వారందరికి శుభాభినందనలు.  ఈ సందర్భంగా ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమర వీరులందరికి ఘన నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు.  తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఈ రోజు మనం ఉత్సాహ పూరిత వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ -2047 విజన్ తో  ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంద న్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్టు  ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి అయోగ్ సమావేశంలో వెల్లడించారని పేర్కొన్నారు.

తెలంగాణ రైజింగ్-2047 కీలకాంశాలు:-  తెలంగాణ రైజింగ్-2047 విజన్ లో నాలుగు కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది.

తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టీస్ పాలసీ, గ్రీన్ ఎనర్జి పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింద న్నారు. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత. ఇది తెలంగాణ రూపురేఖలనే మార్చేస్తుంద న్నారు.