calender_icon.png 12 June, 2025 | 12:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాచలంలో జరిగిన హత్య కేసులో పట్టుబడిన ప్రధాన నిందితుడు సాయిరాం

10-06-2025 11:06:20 PM

వివరాలు వెల్లడించిన ఏఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌..

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలంలో ఇటీవల జరిగిన కనితి సతీష్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన గుంజ సాయిరాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు భద్రాచలం ఎస్పి క్రాంతి సింగ్ కుమార్(SP Kranti Singh Kumar) తెలియజేశారు. మంగళవారం సాయంత్రం అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో వివరాలు తెలియజేస్తూ హత్య కేసు విచారణ చేపట్టిన భద్రాచలం పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి నేరస్తుల కోసం వెతుకుతుండగా ప్రధాన నిందితుడైన గుంజా సాయిరాం సోమవారం పట్టుకోవడం జరిగిందని తెలిపారు.

పట్టుకున్న ప్రధాన నిందితుని అరెస్ట్ చేసి భద్రాచలం ప్రధమ శ్రేణి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తున్నట్లు కూడా ఏఎస్పీ తెలిపారు. మిగిలిన నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నవని తెలిపారు. ప్రధాన నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన టౌన్ ఇన్స్పెక్టర్ ఎం నాగరాజు, సబ్ ఇన్స్పెక్టర్లు స్వప్న సతీష్ రామకృష్ణ తో పాటు సిబ్బందిని అభినందించినట్లు కూడా తెలిపారు. నిందితులు కోసం బృందాలు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని త్వరలోనే నిందితులందరినీ పట్టుకుంటామని ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపారు.