calender_icon.png 12 June, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీలో బిజీబిజీగా ఎంపీ డీకే అరుణ

10-06-2025 11:02:43 PM

అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే.. వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్న పాలమూరు ఎంపీ..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): పాలమూరు పార్లమెంటు పరిధి అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం ఎంపీ డీకే అరుణ(MP DK Aruna) శ్రమిస్తుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఢిల్లీ పర్యటనలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ బిజీ బిజీ వివిధ పనుల్లో నిమగ్నమయ్యారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్(Union Railway Minister Ashwini Vaishnaw)తో కీలక భేటీపై పలు అంశాలను ప్రస్తావించారు.  మహబూబ్ నగర్ పార్లమెంట్ లో పెండింగ్ లో ఉన్న రైల్వే పనుల కోసం వినతులు సమర్పించారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని కృష్ణా - వికారాబాద్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ పనులు త్వరగా ప్రారంభించాలని  ఎంపీ కోరారు.

ఈ ప్రాజెక్ట్ ను సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చూడాలని, ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే హుబ్లీ, తో పాటు ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ (ప్రయాణం) మరింత సులభతరం అవుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కు వివరించిన ఎంపీ డీకే అరుణ వివరించారు. అలాగే పార్లమెంట్ పరిధిలో పెండింగ్ లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి (RUB), రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనులకు సంబంధించి గతంలో ఇచ్చిన తమ ప్రతి పాదనలు పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ROB, RUB పనులు త్వరగా ప్రారంభించి, పూర్తి చేయాలన్నారు. ఎంపీ ప్రతిపాదించిన అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. పాలమూరు రైల్వే ప్రాజెక్ట్ పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారని ఎంపీ తెలియజేసారు.