10-06-2025 11:09:19 PM
భూభారతి రెవెన్యూ సదస్సులో కిష్టా నాయక్..
హన్వాడ: భూభారత్ చట్టం పకడ్బందీగా అమలు జరుగుతుందని హన్వాడ తహసీల్దార్ కిష్ట నాయక్(Tehsildar Kishta Naik) అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పెద్దదర్ పల్లి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన పలు ఫిర్యాదులను తహసీల్దార్ కిష్ట నాయక్ స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... భూభారతి ప్రతి ఒక్కరి భూములకు భద్రత కల్పిస్తుంది అని తెలిపారు. అక్రమాలకు తావు లేకుండా భూములకు రక్షణ కవచముల భూభారతి పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామస్వామి గౌడ్, చంద్రశేఖర్, రఘురాం గౌడ్, సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారు.