24 June, 2026 | 1:01 PM

Breaking News

నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •   ఆశీర్వాద సభ సన్నాహక సమావేశం   •   నేషనల్ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఉప్పరపల్లిలో ఆస్తి వివాదం.. కన్న తండ్రిపై కుమారుడు దాడి   •   బీజేపీ కుట్ర చేసే ప్రమాదం.. SIR ప్రక్రియలో బీఎల్ఏలే కీలకం   •   కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..! 10 రోజులే సమయం   •   గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు పరిపాలన అనుమతి   •  

శాంసన్ ఎన్నాళ్లకెన్నాళ్లకు..

21-09-2024 12:00 AM
  1. ఐదేళ్ల తర్వాత సెంచరీ 
  2. దులీప్ ట్రోఫీ మూడో రౌండ్

అనంతపురం: దులీప్ ట్రోఫీ మూడో రౌండ్‌లో భాగంగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-డి జట్టు ఆటగాడు సంజూ శాంసన్ (106) సెంచరీతో మెరిశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో శాంసన్ ఐదేళ్ల తర్వాత శతకం బాదడం విశేషం. సంజూతో పాటు ఓపెనర్లు పడిక్కల్ (50), శ్రీకర్ భరత్ (52) అర్ధ సెంచరీలు చేయడంతో ఇండియా-డి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 349 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-బి జట్టు రెండో రోజు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది.

క్రీజులో సుందర్ (39*), చహర్ (0*) ఉన్నారు. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (116) సెంచరీతో కదం తొక్కాడు. ఇండియా-సితో జరుగుతున్న మరో మ్యాచ్‌లో ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకే పరిమితమైంది. శాశ్వత్ రావత్ (124) సెంచరీ చేసినప్పటికీ మిగతావాళ్లు రాణించడంలో విఫలమయ్యారు. ఇండియా-సి బౌలర్ వైశాక్ విజ య్‌కుమార్ 4 వికెట్లతో రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండి యా-సి జట్టు రెండో రోజు ఆట ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఇక ఇండియా-బి జట్టుకు ఆడుతున్న టీ20 స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ పూర్తిగా నిరాశపరిచాడు.