calender_icon.png 17 June, 2025 | 2:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక టోకెన్ల జారీ

17-06-2025 12:32:34 AM

మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి

మానకొండూర్, జూన్ 16 (విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక రవాణా చేయడానికి వీలుగా టోకె న్లు జారీ చేస్తున్నట్టు మానకొండూ రు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. మానకొం డూర్ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం ఆయన మండలంలో ని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు చేపట్టాలని, ఆ నిర్మాణాలకు అవసరమైన ఇసుకను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుందని చెప్పారు. అందుకు అనుగుణంగా లబ్ధిదారులకు ఇసుక టోకెన్లు అందజేస్తున్నమన్నారు. ఈ టోకెన్లను లబ్ధిదారులు వినియోగించుకోవాలని ఆయన కోరారు.15వ విడతలో మానకొండూరు మండలంలోని 60 మంది లబ్ధిదారులకు రూ.12,93,00 మంజూరు కాగా వాటిని చెక్కుల రూపంలో ఇప్పుడు పంపిణీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి వరలక్ష్మీ, మానకొండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నందగిరి ర వీంద్ర చారి, మానకొండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్,పార్టీ నాయకులు తాళ్ళపల్లి సంపత్ గౌడ్, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, రేమిడి శ్రీనివాసరెడ్డి రేమిడి తిరుపతిరెడ్డి, బండి మల్లేశం గౌడ్, బుర్ర శ్రీకాంత్ గౌడ్, కొండ సురేష్, ఎండి ఇర్ఫాన్, నరేష్ , కనకం కుమార్, సహదేవ్, గుడాల మహేందర్, సాయిరి దేవయ్య, మడుపు ప్రేమ్ కుమార్, బాకారపు రమేష్, సంతోష్, గొల్లెన కొమురయ్య, నాగిశెట్టి రాజయ్య, తిరుపతి, సత్తయ్య పాల్గొన్నారు.