17-06-2025 12:34:12 AM
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి, జూన్ 16(విజయ క్రాంతి) రాజకీయా పార్టీలకతీతంగా పేదల సంక్షేమం కోసం కృషి చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. సోమవారం పెద్దపల్లి మండలంలోని నిట్టూర్, తుర్కలమద్దికుంట గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలను అందజేసి, ఇండ్లకు ముగ్గు పోసి ఇంటి నిర్మాణాల పనులను ప్రారంభించారు.
అనంతరం తుర్కమద్దికుంట లో బడిబాట కార్యక్రమంలో భాగంగా పిల్లలకు దుస్తువులు అందజేసి పిల్లలకు అక్షరాభ్యాసం చే యించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూపార్టీలు, రాజకీయాలకతీతంగా పేదల సం క్షేమం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలను నమ్మించి మో సం చేశారని ఆరోపించారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా 22 వేల 500 కోట్లతో మొదటి విడతలో రూ. 4 లక్షల 50 వేల ఇండ్లు మంజూరు చేసిందని, రాబోయే 3 సం వత్సరాలలో మొత్తం 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. రా బోయే 3 సంవత్సరాలలో మరో మూడు విడతలుగా ఇండ్లు ఇస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, ఎనగందుల ప్రదీప్, అరె సంతోష్, బండారు రామూర్తి, కాలబోనా మహందర్, సంధవేనా రాజేందర్, యెడల్లు శెంకర్, కట్కూరి సుధాకర్ రెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.