24-06-2025 08:47:30 PM
జగదేవపూర్ (విజయక్రాంతి): జగదేవపూర్ మండల వ్యాప్తంగా రైతు వేదికలలో రైతు భరోసా సంబరాలు రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రములోని రైతు వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖముఖి సందేశాలను తిలకించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి(AMC Chairman Narender Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పాలనలో రైతులకు రైతు భరోసా వేసి పేట్టుబడి సాయం అందించిన ఘనత రేవంత్ రెడ్డికి మాత్రమే దక్కుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులను కడుపులో పెట్టుకొని కపడుకుంటుంది అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలలో సత్తా చాటుతామన్నారు. కార్యక్రమంలో ఏఓ వసంతరావు, ఎంపిడిఓ రాంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎండి అజీజ్, అమర రాము, మాజీ సర్పంచ్ కర్ణకర్, గుబ్బ శ్రీనివాస్, రైతులు మల్లయ్య, రాములు, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.