16-06-2025 12:00:00 AM
ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం 18న వర్ధంతి
కాకతీయ యుగంలో సంస్కృత వాఙ్మయం విస్తారంగా అభివృద్ధి పొందింది. పాలకులైన ప్రభువులు, వారి సామంతులు విద్యాపక్షపాతం కలవారై పండిత పోషణ చేసి వాసికెక్కారు. సంస్కృత కవిత్వం ఈ కాలంలో రెండుశాఖల్లో వర్ధిల్లింది. ఒకటి శాసన కవిత్వం. రాజుల, ఆయా సామంత ప్రభువుల వంశ ప్రశస్తిని ఉగ్గడించడం శాసన కవుల కృత్యము. వీరు వట్టి ప్రశస్తి రచయితలు మాత్రమే కారు.
మహావిద్వాంసులు. శాసన కవుల్లో మొదట చెప్ప దగిన వాడు రుద్రమదేవుని అనుమకొండ శాననకావ్య నిర్మాత అచింతేంద్ర యోగి. ఈయన రామేశ్వర దీక్షితుని కుమారుడు. ఆద్వయామృత యతీంద్రుని శిష్యుడు. అనుమకొండ శాసనంలోని సంస్కృత కవిత్వం ప్రౌఢమై సుందరమై చక్కని అలంకారాలలో ఒప్పుతుంది. భారద్వాజ గోత్రీకుడును రేచియార్యుని కుమారుడును అగు నందికవి గణపవర శాసనం వ్రాశాడు. రుద్రమదేవి కోటగిరి శాసనంలో వేదశాస్త్ర ప్రవీణులైన పెక్కురు విద్వాంసులు చెప్పబడ్డారు. వీరిలో ముగ్గురు ద్రావిడ కవులట. ఇమ్మడి మల్లికార్జున నాయకుని పానుగల్లు శాసనం వ్రాసిన అనంతసూరి క్రీ శ.1890 ప్రాంతము వాడు. ఇతడు గోవింద భట్టోపాధ్యాయుని దౌహిత్రుడు. ఇందర్ని మించి కీర్తినందిన వాడు మయూరశర్మ కుమారుడు ఈశ్వర భట్టోపాధ్యాయుడు. ఈయన మల్యాల వంశం వారి ఆస్థాన విద్వాంసుడు. పాణినీయ వ్యాకరణ పారంగతుడు. ఇతడు బూదపుర శానన కావ్యాన్ని వ్రాశాడు. బంధ కవిత్వంలో కూడా ఈయనది అందె వేసిన చేయి.
కావ్యకర్తలు:
శానన కపులేకాక సంపూర్ణ కావ్య నిర్మాతలు పలువురు వినవస్తున్నారు. వారిలో అగ్రగణ్యుడు అగస్త్య కవి. ఇతడినే విద్యానాథుడని కొందరంటారు. అగస్త్య కవి సంస్కృతంలో బాలభారతాన్ని రచించాడు. దీని కవి త్వం సరళమై ఇది విద్వదామోదాన్ని భాగా పొందింది. దీనికి విజయనగర యుగపు వాడైన సాళువ తిమ్మరసు మనోహర వ్యాఖ్య కూర్చినాడు. ఆగస్త్యుడు డెబ్బదికి మించి రచనలు చేసినాడట. కాని వానిలో అత్యధిక భాగం నష్టమయాయి. ఇతని మరొక కావ్యము ‘నలకీర్తి కౌముది’. ఇతడు వచన రచనలోను దిట్ట. ‘కృష్ణ చరిత్రము’ ఈతని గద్యకావ్యము. మథురా విజయ గ్రంథకర్తి గంగాదేవి అగస్త్య పండితుని ప్రతిభావంతురాలైన శిష్యురాలు. ప్రతాపరుద్రుని ఆస్థాన విద్వాంసుల్లో శాకల్యమల్లు భట్టుగారు అభ్యర్థిత స్థానం కలవా డు. ఈయన ‘ఉదాత్త రాఘవము’, ‘నిరోష్ట్య రామాయణము’ రచించాడు. ‘ఉదాత్త రాఘవము’ అధిక జనామోదము పొందినది. దీనిమీద రెండు వ్యాఖ్యలు వెలువడినాయి. ఈయన జ్యోతిష్యమునందు కూడ ప్రజ్ఞాధురీణుడని అఘటన ఘట నా సామర్థ్యం కలవాడని ‘సిద్ధేశ్వర చరిత్ర’ వర్ణి స్తూంది. బంగారు పల్లకిలో రాజాస్థానమునకు రాగల గొప్ప స్థానము ఈయనది. ఈ కాలంలోనే జైనకవి అప్పయార్యుడు జీవించి ‘జినేంద్ర కళ్యాణాభ్యుదయం’ వ్రాశాడు.
నాటక రచనలో కూడ తెలుగు విద్వాంసులు వాసి గాంచినారు. గంగాధరుడనే పండితుడు ‘మహాభారత కథ’ను నాటకంగా రచించాడట. ఇది యిప్పుడు లభించడం లేదు. ఇతడు అగస్త్య పండితుని సోదరిని పెండ్లియాడినాడు. ఈయనకు ప్రజ్ఞాకాలులు ఇద్దరు కుమారులు. అందు విశ్వనాథుడు ‘సౌగంధికాపహరణ’ నాటకం వ్రాశాడు. నరసింహుడు ‘కాదంబరీ కళ్యాణ’ నాటకం గ్రంథించాడు. నరసింహకవి దశవిధ రూపకాలకు ఉదాహరణ కాగల నాటకాలు వ్రాశా డట. రావిపాటి త్రిపురాంతక కవి ‘ప్రేమాభిరామం’ అనే వీధి నాటకము కూర్చాడు. దీని లో ఓరుగల్లు ప్రజా జీవితము చక్కగా చిత్రింపబడింది. దీని నాధారంగా చేసుకొనియే వినుకొండ వల్లభరాయడు తన ‘క్రీడాభిరామ’ నాటక ప్రబంధాన్ని నిర్మించాడు.
సంస్కృత సాహిత్యానికి అలంకారశాస్త్ర ప్రక్రియలో ఆంధ్రులు చేసిన సేవ మిక్కిలి గణనీయమైనది. దీనిలో మున్ముందు చెప్పదగినవాడు విద్యానాథుడు. ఈయన ‘ప్రతా పరుద్ర యశోభూషణము’ అను ప్రామాణికమైన అలంకారశాస్త్ర గ్రంథాన్ని రచించాడు. ప్రతాపరుద్ర చక్రవర్తిని ఉదాహరణాల్లో నిబంధించాడు. ఇందులో నాటక ప్రకరణ ము, ఉదాహరణ నాటకము కూడ ఉండుటచే ఈ గ్రంథ ప్రయోజనము సాహిత్యా ధ్యేతలకు ద్విగుణీకృతమైనది. తరువాతి ఆం ధ్రాలంకారికులు అందరికీ విద్యానాథుడు ఒరవడియైనాడు. వ్యాఖ్యాన రచనకూడ ఆం ధ్ర విద్వాంసుల ప్రత్యేక కళ. శ్లోక వార్తికము మీద కొలని రుద్రదేవుడు ‘రాజరుద్రీయ’ వ్యాఖ్య రచించినాడు. ప్రతాపరుద్రుని వద్ద బ్రహ్మజోద్యోగి అయిన గుండయభట్టు అను పండితుడు శ్రీహర్షుని ఖండన ఖండకావ్యం మీద వ్యాఖ్య నిర్మించాడు. భాష్య గ్రంథాల్లో పాల్కురికి సోమనాథుని ‘రుద్రభాష్యము’, ‘సోమనాథ భాష్యము’ పేర్కొనదగినవి. రుద్రభాష్య మిప్పుడు ఉపలభ్యం కావటం లేదు. యజుర్వేద మందలి రుద్రాధ్యాయానికి ఇది వివరణయని చెప్పుచున్నారు. ‘సోమనాథ భాష్యము’ శివపా రమ్యమును స్థాపిస్తూ వేద, ఉపనిషత్, సూత్ర, పురాణ, ఆగమ వాఙ్మయములను విస్తారంగా ఉద్ధరిస్తూ నిర్మింపబడిన జటిలవాద గ్రంథము. దీనిలో హరదత్తాచార్యుని చతుర్వేద సార సంగ్రహము నుండి గ్రంథభాగాలు ఎడనెడ వస్తూ ఉంటాయి. మొత్తం మీద పాల్కురికి సోముని ఆపార వైదుష్యానికి ఇది తార్కాణము.
లలితకళలకు సంబంధించిన శాస్త్రగ్రంథా ల్లో గజసాహిణి జాయప సేనాని రచించిన ‘నృత్త రత్నావళి’ అభినయశాస్త్రంలో ఆగ్రగణ్యమైన రచనగా పరిగణింపబడుతూంది. దీనిలో జాయపుడు మార్గదేశీ వృత్త విధానాలు రెండింటినీ సాధికారంగా చర్చించా డు. అభినవ గుప్త, కీర్తిదరుల ననుసరించి మార్గనృత్యమును మతంగ పద్ధతిని దేశి నృత్యమును ఈతడు ప్రపంచించెను.
‘కాకతీయ యుగము’ నుంచి..
‘ఇంటర్నెట్ ఆర్వైవ్’ సౌజన్యంతో..