08-02-2026 12:00:00 AM
ఎన్టీఆర్ స్టేడియంలో రెండు రోజుల పాటు సంత్ నిరంకారి మిషన్
భక్తులకు సందేశాన్నిచ్చిన సద్గురు మాతా సుదీక్ష జీ మహారాజ్
ముషీరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సంత్ నిరంకారి మండల్ ఆధ్వర్యంలో శనివారం దక్షిణ భారత సంత్ నిరంకారి సమా గం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది, సంత్ నిరంకారి మిషన్ ప్రయా ణంలో సద్గురు మాత సుదీక్ష జీ మహారాజ్, నిరంకారి రాజపిత రమిత్ జీ ల సమక్షంలో ఈ సమాగం ప్రారంభమైంది. దీంతో వేలాది మంది భక్తుల ఆధ్మాత్మిక బావాలతో ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణమంతా భక్తి పారవ శ్యంతో మార్మోగింది.
దక్షిణ భారత రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు సద్గురు మాతా సుదీక్షా జీ మహరాజ్ ను సందర్శించి ఆశీర్వచనాలు పొందారు. ఈ సంద ర్భంగా భక్తులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు హాజరై సద్గురు మాత సుదీక్ష జీ మహారాజ్ ఆశీస్సులు పొందారు.