08-12-2025 05:54:19 PM
సర్పంచ్ అభ్యర్థి కోడెపాక పద్మ బాబు
హనుమకొండ (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల పరిధిలోని సూదన్ పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని కోడేపాక పద్మ బాబు హమీ ఇచ్చారు. ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియలలో భాగంగా సుదనపల్లి గ్రామంకు ఎస్సీ మహిళకు రిజర్వుడు కావడంతో సర్పంచ్ అభ్యర్థిగా తాను ఎన్నికల బరిలో ఉన్నానని అన్నారు. గ్రామ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా, అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తానని వివరించారు.
గ్రామానికి అవసరమైన మంచి పనులు చేసేందుకు కృషి చేస్తానని, నిరంతరంగా అందుబాటులో ఉంటానని తెలిపారు. గ్రామంలో మంచి నీటి సమస్యతో పాటు అన్ని మౌళిక వసతులు కల్పిస్తానని పేర్కొన్నారు. గత పది ఏళ్ళగా తన భర్త బాబు పంచాయతీ వార్డు సభ్యులుగా పని చేసి, గ్రామాభివృద్దికి కృషి చేశారని అన్నారు. తన భర్త అందించిన స్పూర్తితో ప్రస్తుతం సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని తెలిపారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పని చేసే, తనను గ్రామ ప్రజలు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.