7 April, 2026 | 5:08 PM

Breaking News

ఎమ్మెల్యే విజయ రమణారావుకు నిలువెత్తు దండతో ఘనంగా సన్మానం   •   చంద్ర మహంకాళి ఆలయంలో పూజలు   •   గోపాల్పేట్ శ్రీ నల్లపోచమ్మ నూతన ఆలయ కమిటీ ఎన్నిక   •   పేదల స్వంతింటి కల కాంగ్రెస్‌తోనే సాకారం: ధరావత్ వీరన్న నాయక్   •   'టచ్ చేసి చూడు.. పాకిస్థాన్‌ ముక్కలే'! పాక్‌కు భారత్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌   •   గిరిజన గ్రామంలో పోలీసుల గ్రామోత్సవం నిర్వహణ   •   రసాయనాల నియంత్రణతో క్యాన్సర్ నివారణ   •   ఘనంగా జీవీఆర్ జన్మదిన వేడుకలు   •   పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కటింగ్   •   ఐఎన్టీయుసీ కాంట్రాక్ట్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎస్కే బాజీ సాహెబ్   •  

కన్నాలలో బాలామృతం కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గుడిసె గట్టయ్య

07-04-2026 03:09 PM

మంథని,(విజయక్రాంతి): మంథని మండలం కన్నాల గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల భాగంగా మంగళవారం అంగన్వాడీ సెంటర్ లో చిన్నారుల తల్లిదండ్రులకు బాలమృతం కోడిగుడ్లు బలహీనంగా ఉన్న చిన్నారులకు బాలమృతం ప్లస్ ప్యాకెట్లను మంగళవారం గ్రామ సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్ చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి చిన్నారులను జీరో నుంచి ఐదు సంవత్సరాల వరకు ఇక్కడే ఉంచాలని  ప్రభుత్వం ఇచ్చే ఫుడ్డు తినడం వల్ల చిన్నారులు బలంగా తయారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రామగిరి సంపత్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మధుకర్, అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి, ఆయాలు సునీత, లింగమ్మ, గ్రామస్తులు జంగిలి శ్రీనివాస్, ఉడుత శ్రీనివాస్, పాల్గొన్నారు.