13-02-2026 04:19:06 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా గ్రామ పంచాయతీ నర్సరీ ని సర్పంచ్ బానోతు అరుణా దేశ్ పాండు నాయక్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కలకు నీరు పోసి ఉపాధి హామీ కూలీలకు అవగాహాన,సూచనలు సలహాలు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి నరేష్,ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ భూక్యా పీకా, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.