20-12-2025 12:00:00 AM
ప్రజల రుణం తీర్చుకుంటా
సర్వాయి గ్రామ సర్పంచ్ కోరం నర్సయ్య(రాజు)
కన్నాయిగూడెం,డిసెంబర్19: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని సర్వాయి గ్రామ ప్రజలు నాకు అవకాశం ఇచ్చి సర్పంచిగా గెలిపించినందుకు సర్వాయి గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటానని సర్వాయి గ్రామ సర్పంచు కోరం నర్సయ్య(రాజు) అన్నారు ఈ సందర్భంగా కోరం నర్సయ్య(రాజు) మాట్లాడుతూ సర్వాయి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు అహర్నిశల కృషి చేస్తానని నాపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేస్తానని గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంలో వెనుకంజ వేయనని అన్నారు. సర్వాయి గ్రామ ప్రజలు నాకు ఐదు సంవత్సరాలు సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని సర్పంచ్ ఒక పదవిగా కాకుండా బాధ్యతగా ఉండి సర్వాయి గ్రామ అభివృద్ధి చేస్తానని తెలిపారు.