28-06-2025 05:45:41 PM
కుభీర్,(విజయక్రాంతి): మండల కేంద్రం కుభీరుకు చెందిన సట్ల గంగాధర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఇటీవల బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మాజీ సర్పంచ్ విజయ్ తో పాటు మాజీ ఏఎంసి చైర్మన్ సంతోష్ తదితరులు ఆయనను శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హెచ్ఎం గంగాధర్ తాను ఇదే పాఠశాలలో చదువుకుని ఇదే పాఠశాలకు హెచ్ఎం గా బాధ్యతలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.