7 July, 2026 | 7:55 PM

Breaking News

రోడ్డు భద్రత, ఆటో రిక్షాలో ప్రయాణం, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన   •   మృతుడు బొల్లె ప్రశాంత్ కుటుంబానికి స్నేహితుల ఆర్థిక సహాయం   •   జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి   •   బాన్సువాడ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటి   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి: ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   ఐకెపి రుణాలలో తాండూర్ అత్యధిక ఓవర్ డ్యూ   •   సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •   ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •  

పేదింటి ఆడబిడ్డలకు అండగా పథకాలు

21-01-2026 12:04 AM

మొయినాబాద్,జనవరి 20 (విజయక్రాంతి ): మొయినాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పంపిణీ చేశారు. మొయినాబాద్ మండల, మున్సిపల్ పరిధిలోని లబ్ధిదారులకు రూ. 1.21 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని,

ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఈ పథకాలు ఎంతో ఆర్థిక భరోసానిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, తహసీల్దార్ గౌతమ్ కుమార్, ఎంపీడీవో సంధ్య, మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.