19 May, 2026 | 10:06 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

పేదింటి ఆడబిడ్డలకు అండగా పథకాలు

21-01-2026 12:04 AM

మొయినాబాద్,జనవరి 20 (విజయక్రాంతి ): మొయినాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పంపిణీ చేశారు. మొయినాబాద్ మండల, మున్సిపల్ పరిధిలోని లబ్ధిదారులకు రూ. 1.21 కోట్ల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని,

ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఈ పథకాలు ఎంతో ఆర్థిక భరోసానిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, తహసీల్దార్ గౌతమ్ కుమార్, ఎంపీడీవో సంధ్య, మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.