27-01-2026 12:41:22 AM
అమీర్పేట్, జనవరి26 (విజయక్రాంతి): హైదరాబాద్ కేంద్రంగా విద్యారంగంలో విశేష గుర్తింపు పొందిన పేస్ ఐఐటి అండ్ మెడికల్ సంస్థ, జెఈఈ, నీట్, వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడంలో తనదైన ముద్ర వేసిందని సంస్థ ప్రతినిధులు తెలి పారు. ఈ సందర్భంగా పేస్ హైదరాబాద్ డైరెక్టర్లు హరిత కస్తూరి, చరిత దిట్టకవి (ఫౌండేషన్ బిల్డర్) మాట్లాడుతూ.. ప్రతిభావంతులైన విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందించేందుకు 50 మంది ఉత్త మ విద్యార్థులకు ప్రత్యేక స్కాలర్షిప్లను ప్రకటించిందన్నారు.
విశిష్ట అతిథిగా హాజరైన వెటరన్ లెఫ్టినెంట్ కల్నల్ కె. విజయ్ శ్యామ్ విద్యార్థు లు, తల్లిదండ్రులను ఉద్దేశించి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ కస్తూరి శంకర్ , పేస్ హైదరాబాద్ విశిష్ట అధ్యాపక బృందానికి చెందిన జయసింహా, మురళీధర్, సత్యనారాయణ మూర్తి, సాయి మానస్ పాల్గొన్నారు.