15 April, 2026 | 1:18 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

యువతను క్రీడల వైపు ప్రోత్సహించడమే లక్ష్యం

27-01-2026 12:42 AM

ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, జనవరి26 (విజయక్రాంతి): యువతను క్రీడల వైపు ప్రోత్సహించడమే టోర్నమెంట్ల లక్ష్యమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. ఎల్.ఎన్ నగర్‌లోని పీజేఆర్ ప్లే గ్రౌండ్ లో నిర్వహిస్తున్న పి.జనార్దన్ రెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను సోమవారం ముఖ్య ఆహ్వానితులుగా హాజరై ప్రారంభించారు. బ్యాటింగ్ చేసి కాసేపు ప్రేక్షకులను అలరించారు.

ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ క్రికెట్ వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, వ్యక్తుల మధ్య స్నేహ భావం పెంపొందుతుందన్నారు.పి.జనార్దన్ రెడ్డి జ్ఞాపకార్థం టోర్నమెంట్ నిర్వాహకులను అభినం దించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.