12-06-2025 08:45:00 AM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం(Schools Reopen ) అయ్యాయి. 50 రోజుల తర్వాత మళ్లీ విద్యార్థులు బడికి వెళ్తున్నారు. బడి బాటతో రాష్ట్రవ్యాప్తంగా సర్కార్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలతో చేర్చించాలని ప్రభుత్వం తల్లిదండ్రులను కోరుతోంది. విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు. తొలిరోజు ఏకరూప దుస్తులు, పుస్తకాలు అందించేందుకు చర్యలు చేపట్టనున్నారు. 2025-26 విద్యాసంవత్సరానికి గాను అకడమిక్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ఈ ఏడాది మొత్తం 230 పని దినాలను విద్యార్థులకు ఖరారు చేసింది.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రాథమిక పాఠశాలలు నడవనున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 గంటలకు వరకు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు నడవనున్నాయి. విద్యార్థులకు నోటు బుక్స్ సైతం అందించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ప్రైవేటు పాఠశాలల బస్సుల భద్రతపై అధికారులు దృష్టి పెట్టారు. ఫిట్ నెస్ లేని బస్సులపై అధికారులు జరిమానా విధిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు(Pre-primary classes) నిర్వహణకు ప్రభుత్వం ఆదేశించింది. 210 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించేందుకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. 2025-6 ఏడాదికి విద్యార్థులను చేర్చుకోవాలని డీఈవోలకు ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ తరగతులు చెప్పనున్నారు.