calender_icon.png 13 June, 2025 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం

12-06-2025 08:27:29 AM

తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanam) భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శానికి(Srivari Sarva Darshan) 15 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లలో నిండి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 79,296 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,511 మంది భక్తులు తిరుమలలో శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. బుధవారం తిరుమలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.49 కోట్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. టీటీడీ పాఠశాలల్లో ఈ నెల 16 నుంచి 19 వరకు సద్గమయ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.